పోలవరం ప్రాజెక్టుకు వైయస్ఆర్ పేరు పెట్టాలి
28 May, 2019 12:52 IST
విశాఖ: పోలవరం ప్రాజెక్టు, విశాఖ సెంట్రల్ పార్క్కు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ డిమాండు చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఎన్ఆర్ఈజీఎస్ బకాయిలు కూడా రూ.కోట్లలో ఉన్నాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ కాలంలో ఉన్న ప్రాజెక్టులే ఇప్పటికీ సాగుతున్నాయన్నారు.