అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం జరగనుంది. శాసనసభ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.