కౌంటింగ్ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి
18 May, 2019 12:04 IST
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం కోరింది. చంద్రగిరి పరిధిలో రీ పోలింగ్ సజావుగా జరిపించాలని కోరారు. కాసేపటి క్రితం పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మేకపాటి రాజమోహన్రెడ్డి, బుట్టా రేణుక, అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబు సీఈసీని కలిశారు.