చంద్రబాబు కుటిల‌య‌త్నాల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొవాలి..

22 Jan, 2019 12:42 IST

తూర్పుగోదావ‌రి:చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అందుకే వైఎస్సార్‌సీపీ ప్రకటించిన పథకాలను ఆయన కాపీ కొడుతున్నార‌న్నారు.ప్రత్తిపాడు నియోజకవర్గం బూత్‌ కమిటీ సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని  వైయ‌స్ఆర్‌సీపీ మాజీ  ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు వందల హామీలల్లో ఒక్క హామీ కూడా ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ చేసే కుటిల యత్నాలను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొని వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.