కృష్ణా జిల్లా: దేవినేని ఉమకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైయస్ఆర్సీపీ నేత వసంత నాగేశ్వరరావు విమర్శించారు. విమర్శలు చేసే ముందు ఉమ రాజకీయ చరిత్ర గుర్తు చేసుకోవాలని సూచించారు. నీకు, నీ అన్నకు రాజకీయ భిక్ష పెట్టింది తానే అన్నారు. తాను నడవలేకపోయినా చేయాల్సింది చేస్తానని హెచ్చరించారు. ఉమ తట్టాబుట్టా సర్దుకొని సిద్ధంగా ఉండాలని సలహా ఇచ్చారు.