అమరావతి: ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికపై తన పేరిట సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తమని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజావేదికకు సంబంధించి నేను కానీ, పార్టీ తరపున కానీ ఎటువంటి లేఖలు ఇవ్వలేదన్నారు.ఈ అంశంపై సోషల్ మీడియా కథనాలు అవాస్తవం అని తెలిపారు.