కర్నూలు: చంద్రబాబు పాలన నుంచి ప్రజల విముక్తి కోరుకుంటున్నారని పాణ్యం వైయస్ఆర్సీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు.టీడీపీ ప్రభుత్వ పాలనలో టీడీపీకి చెందిన వారే అభివృద్ధి చెందారు తప్ప.పేద ప్రజలు అభివృద్ధి చెందలేదన్నారు.జన్మభూమి కమిటీల పేరుతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారన్నారు. ఒక మాట ఇస్తే నిలుపుకునే వ్యక్తి వైయస్ జగన్మోహన్రెడ్డి అయితే, ప్రజలను ఎలా మోసం చేయాలని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.చంద్రబాబుకు ఓటు వేస్తే మాత్రం వరుణ దేవుడు కూడా పారిపోతాడన్నారు.రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభంజనం కొనసాగుతుందన్నారు.