చంద్రబాబు,పవన్ కుమ్మక్కు రాజకీయాలు
23 Mar, 2019 11:18 IST
కృష్ణా:వైయస్ఆర్ పాలనను ప్రతి కార్యకర్త గుర్తు చేసుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు బాలశౌరి,పేర్ని నాని పిలుపునిచ్చారు. టీడీపీ కుట్రలు,కుతంత్రాలపై ప్రజల్ని చైతన్య వంతుల్ని చేయాలన్నారు. చంద్రబాబు,పవన్ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు నమ్మరని తెలిపారు. వైయస్ఆర్సీపై చంద్రబాబు,ఆయన జేబు మీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు.వైయస్ఆర్సీపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు.