అధికారం అనేది పవర్ కాదు..బాధ్యత
అమరావతి: అధికారమన్నది పవర్ కాదు..అది ఒక బాధ్యత అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనారు. కేబినెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత కల్పించాలన్నదే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య విధానమని తెలిపారు. పదవులు దక్కలేదన్న నాయకుల అసంతృప్తి కాదని, వారి అనుచరుల తాత్కాలిక అసంతృప్తి మాత్రమేనని చెప్పారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉందని స్పష్టం చేశారు. సోమవారం తాత్కాలిక సచివాలయం వద్ద సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలన్నదే పార్టీ సిద్ధాంతం. ఇందులో ఒకరికి న్యాయం, మరొకరికి అన్యాయం అన్నది ఎక్కడా లేదు. అందరూ అర్థం చేసుకున్నారు కాబట్టే పూర్తిగా సాఫీగా సాగుతోంది. అధికారం మా నాయకుడికి రావాలన్నదే అనుచరుల బాధ..అక్కడి నుంచి అసంతృప్తి అంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. ఆవేశంతో కొంత మంది రాజీనామాలు అనే మాట వచ్చి ఉంటుంది. పరిమితి సంఖ్యలో ఉన్న పోస్టులో అందరికీ న్యాయం చేయడం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇదంతా తాత్కాలికమే. నాయకుడి అసంతృప్తి అన్నది అవాస్తమని కొట్టిపారేశారు. పార్టీ బాధ్యతలు, రీజినల్ కో–ఆర్డినేటర్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. వాళ్లు కీలకంగా మారుతారు. బీసీలకు పెద్ద పీట వేయడమన్నది కచ్చితంగా గమనించాలి. కావాలనే దీన్ని దుష్ప్రచారం చేయడం ఓ వర్గం మీడియా కుట్రనే. అనుచరులకు బాధ ఉంటుంది..దాన్ని అధినేత అర్థం చేసుకుంటారు. చాలా మంది నేతలు స్పోర్టివ్గా తీసుకున్నారు. 2014లో చంద్రబాబు 25 బెర్తులు ఉన్నా ఎందుకు 19 మందినే నియమించుకున్నారు. ఆయన కుమారుడి కోసం మరో ఐదు పోస్టులు భర్తీ చేశారు. ఇవన్నీ మరిచి ఇవాళ టీడీపీ నేతలు అడ్డగోలు కామెంట్లు చేస్తూ సునకానందం పొందుతున్నారు.
మంత్రివర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లు అందరూ కలిసి ఎన్నికల టీమ్గా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో వీరంతా పార్టీని విజయపథంలో నడిపిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.