వైయస్ జగన్ పాలన ఐదు దశాబ్దాలు కొనసాగాలని...
6 Feb, 2021 12:20 IST
తిరుమల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఐదు దశాబ్ధాలు కొనసాగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని సజ్జల రామకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..ఆర్థికంగా ఉన్న ఇబ్బందులని తొలగిపోయి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజారంజకంగా సాగుతున్న వైయస్ జగన్ పాలన నాలుగు...ఐదు దశాబ్దాలు కొనసాగాలని స్వామి వారిని ప్రార్థించానని సజ్జల రామకృష్ణరెడ్డి తెలిపారు.