దుబాయ్లో వైయస్ఆర్సీపీ అభిమానుల సంబరాలు
31 May, 2019 17:57 IST
దుబాయ్ : వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైయస్ఆర్సీపీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దుబాయ్లో ఉన్న వైయస్ఆర్సీపీ అభిమానులందరూ ఒక్క చోట చేరి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా వైయస్ఆర్సీపీ యూఏఈ కన్వీనర్లు ప్రసన్న సోమి రెడ్డి , బ్రహ్మనంద రెడ్డి , రమేష్ రెడ్డి , విజయ్ , దిలీప్ , రమణ రెడ్డి , యస్వంత్.. యూఏఈ మహిళా విభాగం నాయకురాలు మహిత రెడ్డి, పార్టీ అభిమానులు పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.