ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై లోక్సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. సవరించిన పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర కేబినెట్ తక్షణమే ఆమోదించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాధవి లోక్సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.