తాడేపల్లి: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమం తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. వైయస్ఆర్ విగ్రహానికి నేతలు పూలమాల వేసి నేతలు నివాళులర్పించారు. వైయస్ఆర్ విగ్రహానికి నేతలు పూలమాల వేసి నేతలు నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, జంగా కృష్ణమూర్తి, ఎంపీ నందిగం సురేష్, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు.