విశాఖ: నగరంలోని బీచ్ రోడ్ లో గల ఏ వన్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో వైయస్ఆర్ కప్ బ్రోచర్ ను పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం, బొరివంక గ్రామ యువకులు సత్యానంద రౌలో, బల్లెడ కాళీఉదయ్ , యగళ్ళ లిఖిత, రవి రాజ్ దొలాయి చిత్రీకరించిన ఉద్యానవన పర్యాటక ప్రాంతాల సిడి , బ్రోచర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఏపీ కలింగా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బి.పద్మావతి, వైయస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.