తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్త శ్యామ్ కలకడ తుదిశ్వాస విడిచారు. కరోనా బారినపడి చికిత్స పొందుతూ కన్నుమూశారు. శ్యామ్ మృతికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులర్పించింది. పార్టీ ఆవిర్భావం నుంచి తన చివరి శ్వాస వరకు పార్టీ కోసం పనిచేశారు. శ్యామ్ కలకడ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాధించాలని కోరుకుంటూ పార్టీ ఘన నివాళులర్పిస్తోంది.