వైయస్ఆర్సీపీ కార్యాలయానికి భూమి కేటాయించాలని ఎంపీల వినతి
15 Mar, 2023 15:04 IST
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి కేటాయించాలని పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ను కోరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వి విజయసాయి రెడ్డి, పివి మిధున్ రెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం బుధవారం కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భూమి కేటాయింపు కోసం వినతిపత్రం సమర్పించారు.