ఏపీలో ఉవ్వెత్తున జనాగ్రహ దీక్షలు
22 Oct, 2021 12:20 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉవ్వెత్తున జనాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీ బూతు వ్యాఖ్యలకు నిరసనగా వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రెండో రోజు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రెండో రోజు జనాగ్రహ దీక్షలు మొదలయ్యాయి.
చంద్రబాబు తన వయ స్సుకు తగ్గట్టు వ్యవహరించాలని.. అల్లర్లకు కుట్రలు పన్నడం మానుకోవాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు హితవు పలికారు. టీడీపీ నేతల వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించు కుని క్షమాపణలు చెప్పాలని వైయస్ఆర్సీపీ నేతలు జనాగ్రహ దీక్షల్లో డిమాండ్ చేశారు. చంద్రబాబు సిగ్గుమాలిన రాజకీయాల కు స్వస్తి పలకాలని ఎంపీలు విజయసాయిరెడ్డి, బాలశౌరి, మోపిదేవి వెంకటరమణ, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు మండిపడ్డారు.