వైయస్ఆర్ జిల్లా : మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలసి గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. వైయస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి నివాళులర్పించారు. వైయస్సార్ను స్మరించుకుంటూ మౌనం పాటించారు.