ఏ దేశ అభివృద్ధికైనా శ్రామికులే పట్టుగొమ్మలు
1 May, 2025 11:54 IST
తాడేపల్లి: మేడే సందర్భంగా కార్మికులకు వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఏ దేశ అభివృద్ధికైనా శ్రామికులే పట్టుగొమ్మలు. ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు. నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మిక సోదర సోదరీమణులందరికీ మే డే శుభాకాంక్షలు’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.