ఎస్ఈజెడ్లో రియాక్టర్ పేలుడు ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
21 Aug, 2024 16:04 IST
తాడేపల్లి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో రియాక్టర్ పేలుడు ఘటనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.