‘డాడ్‌.. మిస్‌ యూ’ 

2 Sep, 2024 10:17 IST

వైయ‌స్ఆర్ జిల్లా : మహానేత వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిన.. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈ ఉదయం ఇడుపులపాయకు వెళ్లి వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైయ‌స్ఆర్‌ విగ్రహానికి పూలమాల సమర్పించారు. అనంతరం ఎక్స్‌ ఖాతాలో ఆయన తండ్రికి గుర్తు చేసుకుంటూ ‘డాడ్‌.. మిస్‌ యూ’ అనే ఓ సందేశం ఉంచారు.