అణగారిన వర్గాల ఆశలకు ప్రతీక దామోదరం సంజీవయ్య
14 Feb, 2026 11:40 IST
తాడేపల్లి: అణగారిన వర్గాల ఆశలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు, దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు.
ఈ మేరకు వైయస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘పేదల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు. ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు’ అని పేర్కొన్నారు.