ఎన్నికలు పారదర్శకంగా జరగాలి

11 Mar, 2019 12:52 IST

హైదరాబాద్‌: ఎన్నికలు స్వేఛ్ఛగా, పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. ‘మీ ఓటును కచ్చితంగా పరిశీలించుకోండి. ఓటర్‌ లిస్టులో నమోదు చేయించుకోండి. ఏప్రిల్‌ 11న జరిగే పోలింగ్‌లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు మన హక్కు’ అని పేర్కొన్నారు.