ప్రత్యేక హోదా సాధనే లక్ష్యం
25 May, 2019 13:22 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం ఎంపీలు చిత్తశుద్ధితో పని చేయాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపీలకు పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీల కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైయస్ఆర్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైయస్ జగన్ మాట్లాడారు.