గవర్నర్తో సీఎం వైయస్ జగన్ భేటీ
7 Jun, 2019 16:33 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. మంత్రివర్గ జాబితాను వైయస్ జగన్ గవర్నర్కు అందజేశారు. రేపు ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో గవర్నర్ను ముఖ్యమంత్రి కలిసి జాబితాను అందజేశారు.