హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం తాడేపల్లిలోని వైయస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్ ఎల్పీ సమావేశం నిర్వహించి వైయస్ జగన్ను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు. ఈ తీర్మానం ప్రతిని వైయస్ జగన్ గవర్నర్కు అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను వైయస్ జగన్ కోరారు.