గవర్నర్ కలవనున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి

9 Feb, 2019 11:12 IST

హైదరాబాద్ ఓటర్ల జాబితాల రూపకల్పనలో అక్రమాలు, పోలీసు అధికారుల నియామకల్లో అధికార దుర్వినియోగం  తదితర అంశాలపై వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి  రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నానురు. శనివారం  ఆయన రాజభవన్ లో గవర్నర్ ను కలుసుకోనున్నారు. ఈ అంశాలపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన ప్రతిపక్ష నేత , అదే అంశంలో గవర్నర్ కలవనున్నారు. సర్వేల పేరుతో వైయస్ఆర్ కాంగ్రెస్ సానుభూతి పరుల పేర్లను ఓటరు జాబితాల్లో నుంచి తొలగిస్తున్న విషయాన్ని గవర్నర్ కు తీసుకురానున్నారు.