ఢిల్లీకి బయల్దేరిన సీఎం వైయస్ జగన్
14 Jun, 2019 14:23 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీకి చేరుకున్న తరువాత సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సీఎం వైయస్ జగన్ భేటీ అవుతారు. రేపు శనివారం నీతి అయోగ్ సమావేశంలో పాల్గొంటారు. ఆ తరువాత ఢిల్లీలో వైయస్ఆర్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొని పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.