ఢిల్లీకి బయల్దేరిన వైయస్‌ జగన్‌

3 Feb, 2019 16:05 IST


హైదరాబాద్‌: ఓటర్ల జాబితా అవకతవకలు, అక్రమాలపై సీఈసీని కలవడానికి వైయస్‌ జగన్, వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్యనేతలు కొద్దిసేప‌టి క్రితం హైద‌రాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరారు. రేపు ఉదయం 11.30 గంటలకు సీఈసీని వైయస్‌ జగన్‌ బృందం కలవనున్నారు. పార్టీకి చెందిన మాజీ ఎంపీలు, ముఖ్య నేతలతో కలిసి ఆయన   సోమవారం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ)ను కలుస్తారు. ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున చోటుచేసుకున్న అవకతవకలు, అక్రమంగా పేర్ల తొలగింపు అంశాలతోపాటు రాష్ట్ర డీజీపీ వ్యవహారశైలిపైనా సీఈసీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.