నూతన వధూవరులను ఆశీర్వదించిన వైయస్ జగన్
8 Jan, 2025 21:16 IST
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం విజయవాడలో పర్యటించారు. నోవాటెల్ హోటల్లో వైయస్ఆర్సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి కుమారుడి వివాహా రిసెప్షన్కు వైయస్ జగన్ హాజరై నూతన వధూవరులు హనీ ప్రియ రెడ్డి, కౌషిక్ కుమార్ రెడ్డిలకు వివాహా శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు.