కర్నూలులో ఘనంగా వైయస్ భారతి జన్మదిన వేడుకలు
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి జన్మదిన వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూల్ నగరంలోని వైయస్ఆర్ పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి వైయస్ భారతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు .ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, కర్నూల్ జిల్లా వైయస్ఆర్ పార్టీ అధ్యక్షులు నగర మేయర్ బి వై రామయ్య, నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి , కర్నూల్ కోడుమూరు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్,డాక్టర్ సుధాకర్, కర్నూల్ మాజీ ఎంపీ బుట్టా రేణుక, కర్నూల్ కే డి సి సి బ్యాంక్ చైర్మన్ ఎస్వీ విజయ మనోహర్, కర్నూల్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, కార్పొరేటర్లు జిల్లా నాయకులు పాల్గొన్నారు.