వైయస్ఆర్ జిల్లా : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగుదామని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని కాశినాయన మండలం సంబంధించిన 23 బూత్లు కలిపి వైయస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు చేసిన మేము సిద్ధం, మా బూత్ సిద్ధం..బూత్ కోర్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బూత్ కమిటీల బాధ్యతలను వివరించారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ స్థానంతో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ వైయస్ఆర్ సీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పేదల ప్రయోజనాలే లక్ష్యంగా కృషి చేశారన్నారు. ఆ పాలనా తీరు పార్టీలోని నాయకులు, కార్యకర్తలకు ప్రజల్లో గౌరవాన్ని తెచ్చిపెట్టిందన్నారు. వైయస్ జగన్ సంక్షేమ పథకాలే మన పార్టీ అభ్యర్థుల విజయానికి శ్రీరామ రక్ష అన్నారు. సమావేశంలో బద్వేల్ యువ నాయకులు దేవసాని ఆదిత్య రెడ్డి, నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి, జేఏసీ కన్వీనర హనుమంతు రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పంగా గురివిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి బూత్ కన్వీనర్లు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.