అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు మండలం చీకులగురికి గ్రామంలో "గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉరవకొండ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.మహిమలు హారతులు పట్టారు. మూడేళ్ల వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి చేసిన మేలును విశ్వేశ్వరరెడ్డి గడప గడపలో వివరించారు.