వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో చవితి ఉత్సవాలు
10 Sep, 2021 20:27 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నవరత్నాల అమలు కమిటీ వైస్ చైర్మన్ అంకరెడ్డి నారాయణ మూర్తి, నాయకులు ఎం.చిన్నపరెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.