కాకినాడ: ఆంధ్రప్రదేశ్లో గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొద్దిసేపటి క్రితమే గ్రామ సచివాలయ వ్యవస్థ కొలువు తీరింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించి, గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి, ఉద్యోగులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. అంకిత భావంతో సేవలు అందించాలని ఆయన ....ఉద్యోగులకు సూచించారు.