విజయవాడ: విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద నిర్మించిన ఫై ఓవర్-ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్రెడ్డిలు ప్రారంభించారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను సీఎం వైయస్ జగన్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్రెడ్డి తిలకించారు. కార్యక్రమంలో మంత్రులు శంకర్ నారాయణ , నారాయణస్వామి, కొడాలి నాని, ఆళ్ల నాని, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.