ఆడపిల్లల చావులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడమేంటి?
9 Sep, 2021 13:19 IST
గుంటూరు: ప్రతిపక్ష టీడీపీ అడపిల్లల చావులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం ఏంటని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. నరసరావుపేటకు ఇప్పుడు లోకేష్ పర్యటన చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. శవాల మీద పేలాలు వేరుకుంటూ లోకేష్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంగా మీకు బాధ్యత లేదా అని నిలదీశారు. అన్యాయం జరిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. జరుగుతున్న ఘటనలు దురదృష్టకరమన్నారు. దిశ చట్టాన్ని మీ హయాంలో ఎందుకు తీసుకురాలేదన్నారు. దిశ చట్టం ద్వారా మహిళలకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తుందని చెప్పారు.