వైయస్ఆర్ కాంగ్రెస్ లో కి వరపుల సుబ్బారావు

17 Mar, 2019 20:03 IST

అంబాజీపేట పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలుపొంది, టీడీపీ లోకి చేరిన ఆయన తిరిగి వైయస్ఆర్ సీపీలోకి వచ్చారు. అంబాజీపేటలో అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్న ఎన్నికల సభలో ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. సుబ్బారావు తోపాటు ఆయన కుమారులు సూరిబాబు తదితరులు కూడా పెద్ద సంఖ్యలో వైయస్ఆర్ సీపీలో చేరారు.