సీఎంను కలిసిన కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి
21 Sep, 2021 19:03 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) ఛైర్మన్ సుభాష్ కుమార్లు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్కు సంబంధించిన పలు అంశాల గురించి సీఎం వైయస్ జగన్తో కేంద్ర పెట్రోలియం సెక్రటరీ తరుణ్ కపూర్, ఓఎన్జీసీ ఛైర్మన్ సుభాష్ కుమార్లు చర్చించారు.