రేపు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన వివరాలు

26 Mar, 2019 17:25 IST

 అమరావతి: ప్రతిపక్ష నేత, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు విజయనగరం,విశాఖ,తూర్పుగోదావరి జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 9.30గంటలకు విజయనగరం జిల్లా పార్వతీపురం,ఉదయం 11.30గంటలకు విశాఖ జిల్లా పాయకరావుపేట,మధ్యాహ్నం 2గంటలకు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం,సాయంత్రం మండపేటలో జరిగే ప్రచార సభల్లో వైయస్‌ జగన్‌ ఆయన ప్రసంగిస్తారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు.