ఢిల్లీ బయల్దేరిన సీఎం వైయ‌స్‌ జగన్‌

3 Jan, 2022 11:09 IST


  తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైయ‌స్ జగన్‌ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం వైయ‌స్ జగన్‌ చర్చించే అవకాశం ఉంది.