తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డిసెంబర్ 1 నుంచి 6 వ తేదీ వరకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన పార్టీ సోషల్ మీడియా సైనికులతో విస్తృత స్థాయి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 1 నుంచి 4 వరకు తాడేపల్లిలోని సీఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో, 6న విశాఖపట్నం వుడా చిల్డ్రన్స్ థియేటర్లో నిర్వహించే ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికులందరినీ ఈ సమ్మేళనానికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. సోషల్ మీడియా సైనికులు ఈ సమావేశాలకు తరలి వచ్చి విజయవంతం చేయాలి. ఈ సమావేశం గురించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి (9989033380), వాసుదేవ రెడ్డి (9160620847), హర్షవర్థన్ (9658166666)ను సంప్రదించగలరని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.