నేడు వైయస్ జగన్ పర్యటన వివరాలు
25 Mar, 2019 10:08 IST
అమరావతి: ప్రతిపక్ష నేత,వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం రాయలసీమ ప్రాంతంలోని మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. ఉదయం ఆదోని(కర్నూలు), అనంతరం తాడిపత్రి (అనంతపురం), మధ్యాహ్నం మదనపల్లి(చిత్తూరు)లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో జగన్ పాల్గొని ప్రసంగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.