నేడు వైయస్ జగన్ పర్యటన వివరాలు
29 Mar, 2019 10:19 IST
అమరావతి : ప్రతిపక్షనేత, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. ఉదయం ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడులో పర్యటిస్తారు. అనంతరం కడప జిల్లాలోని బద్వేలులో పర్యటిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు మైదుకూరులో పర్యటిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటన విడుదల చేశారు.