తాడేపల్లి: గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకృతి విపత్తుల వల్ల ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగానే పంట నష్టపరిహారం పంపిణీ చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 2021 సెప్టెంబర్ లో సంభవించిన గులాబ్ సైక్లోన్ కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ.22 కోట్ల పంట నష్టపరిహారం నేడు రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న జగనన్న ప్రభుత్వం. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో పంట పరిహారం డబ్బులు జమ చేయనున్నారు.