నేడు విశాఖ శారదా పీఠానికి సీఎం వైయ‌స్‌ జగన్‌

9 Feb, 2022 10:11 IST

 
 విశాఖపట్నం: విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ విశాఖపట్నం బయల్దేరుతారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి శ్రీ శారదా పీఠానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు శ్రీ శారదా పీఠంలోని పలు కార్యక్రమల్లో పాల్గొంటారు. వేద విద్యార్థులకు సీఎం వైయ‌స్ జగన్‌.. ఉత్తీర్ణత పత్రాలు అందజేస్తారు. అనంతరం మధ్యాహ్నం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని తిరుగుప్రయాణం అవుతారు.