అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కొద్దిసేపటి క్రితం సచివాలయం మొదటి బ్లాక్ సమావేశ మందిరంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. అలాగే గతంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.