టీటీడీ, రైతు సాధికారిక సంస్థ మధ్య అవగాహన ఒప్పందం

12 Oct, 2021 13:06 IST

తిరుమల: అన్నమయ్య భవన్‌లో రైతు సాధికారిక సంస్థ, టీటీడీ మధ్య జరిగిన S ఒప్పంద కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి, రైతు సాధికారిక సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ టి.విజయ్‌ కుమార్‌ అవగాహన ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. అనంతరం డ్రై ఫ్లవర్‌ టెక్నాలజీతో టీటీడీలో వివిధ ఆలయాల్లో ఉపయోగించిన పూలతో చేసిన ఉత్పత్తులను సీఎం వైయస్‌ జగన్‌ పరిశీలించారు.