కర్నూలు: థ్యాంక్యూ సీఎం అనే నినాదాలతో కర్నూలు పట్టణం మార్మోగింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం వైయస్ జగన్ కృషికి అభినందనలు తెలుపుతూ కర్నూలు నగరంలో భారీ ప్రదర్శన చేపట్టారు. కర్నూలులో జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని బీసీజీ కమిటీ పేర్కొనడంతో కర్నూలు నగరంలో ఆనందం వెల్లివిరిసింది. సీఎం వైయస్ జగన్ను అభినందిస్తూ విద్యార్థులు, న్యాయవాదులు, ఎన్జీవోలు భారీ ర్యాలీ చేపట్టారు.థ్యాంక్యూ సీఎం అంటూ నినదించారు.