తాడేపల్లి: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని ఆలయ అర్చకులు ఆహ్వానించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ను కలిసిన వరసిద్ధి వినాయకస్వామి ఆలయ అర్చకులు సీఎంకు వేద ఆశీర్వచనం అందజేసి అనంతరం ఆహ్వాన పత్రిక ఇచ్చి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఎంఎస్ బాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.